తనను మద్యం వ్యాపారి వేధిస్తున్నాడని.. ట్యాంక్ పై నుంచి దూకుతానని బెదిరించాడు.. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు.. దీంతో అందరూ అక్కడికి వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు.. పోలీసులు కూడా చేసుకున్నారు.. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న అతను.. ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయాడు.
తనను మద్యం వ్యాపారి వేధిస్తున్నాడని.. ట్యాంక్ పై నుంచి దూకుతానని బెదిరించాడు.. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు.. దీంతో అందరూ అక్కడికి వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు.. పోలీసులు కూడా చేసుకున్నారు.. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న అతను.. ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయాడు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. చావు బతుకుల మధ్య..ఆ వ్యక్తిని పోలీసులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన యతిరాజు చంద్రశేఖర్ అనే వ్యక్తిని మద్యం వ్యాపారి కులం పేరుతో తిట్టాడు.. దీంతో తాను చనిపోతానని అక్కడినుంచి వెళ్లాడు.. అనంతరం స్థానిక జవహర్ నగర్లో సింగరేణి స్టేడియం ప్రక్కన గల ప్రధాన వాటర్ ట్యాంకు పైకి ఎక్కి దూకుతానని హెచ్చరించాడు. దీంతో స్థానికులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈ క్రమంలోనే.. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు సైతం చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు.
వీడియో చూడండి..
ఈ క్రమంలోనే.. చంద్రశేఖర్ వాటర్ ట్యాంకు ఎక్కడానికి గల కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తుండగానే… మద్యం మత్తులో ఉండడంతో అంతలోనే అదుపు తప్పి అమాంతం కిందపడ్డాడు.. ప్రజలంతా చూస్తుండగానే వాటర్ ట్యాంక్ పై నుంచి కింద పడి చంద్రశేఖర్ కు తీవ్రగాయాలయ్యాయి.. అతని చేయి విరిగి తీవ్ర రక్తస్రావం జరిగింది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రశేఖర్ ను గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు తమ వాహనంలో హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన చూసిన వారంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!