SGSTV NEWS
CrimeTelangana

పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగలు పెట్రేగిపోతున్నారు. పట్టపగలే దారి దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగులు. నిర్మల్‌లోని మయూరి హోటల్‌ ముందు నడుచు కుంటూ వెళ్తున్న మహిళ మెడల్లోంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోల్డ్‌ చైన్‌ లాగేశారు. అటు, మరోచోట కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మయూరి హోటల్ ముందు మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు, శాంతినగర్ లోని మహిళ మెడలో నుంచి బైక్ పై వచ్చి వచ్చి తులం గొలుసు ఎత్తుకెళ్లినట్టుగా ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి

వీడియో..

Also read :Watch Video: గుండె తరుక్కుపోయే ఘటన.. మోకాళ్లపై గిరిజనుల మొర.. ఎందుకంటే..

సెల్ ఫోన్ కోసం యువతి దారుణం.. అసలు ఏం జరిగిందంటే?

Jagan Raghurama : .ఏపీ అసెంబ్లీ హాల్లో జగన్ను రఘురామ పలకరించింది ఇందుకా..!?

Related posts

Share this