సంగారెడ్డ జిల్లా పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో నివసిస్తున్నాడు. అశోక్ పెద్ద కుమార్తె శివానీ (17) హైదరాబాద్లో భీఫార్మసీ చదువుతుంది. ఏం జరిగిందో తెలియదుగానీ రెండు నెలల క్రితం శివానీ సదాశివపేటలోని తమ ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మనస్తాపంతో ఉండేది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో..
సదాశివపేట, ఏప్రిల్ 16: మనస్తాపంతో బీఫార్మసీ చదువుతోన్న ఓ విద్యార్ధిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డ జిల్లా పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో నివసిస్తున్నాడు. అశోక్ పెద్ద కుమార్తె శివానీ (17) హైదరాబాద్లో భీఫార్మసీ చదువుతుంది. ఏం జరిగిందో తెలియదుగానీ రెండు నెలల క్రితం శివానీ సదాశివపేటలోని తమ ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మనస్తాపంతో ఉండేది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని శివానీ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంటి తలుపులు తెరచి చూడగా ఫ్యాన్కు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. కళ్ల ముందు ఉన్న బిడ్డ ఏం కష్టం వచ్చిందో ఇలా అర్ధాంతరంగా జీవితం ముగించిందో అర్ధంకాకా ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతి రాసిన సూసైడ్నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తనకు ఇతరులకు సహాయపడటం చాలా ఇష్టమని, తన తల్లిదండ్రుల అనుమతితో తన శరీరంరోని అవయవాలను దానం చేయాలని కోరుతున్నానని లెటర్లో పేర్కొంది. తాను లేకున్నా తన అవయవాల వల్ల మరో ఇద్దరు జీవిస్తారని తెల్పింది. తన చావుకు తానే కారణమని, దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దని లేఖలో పేర్కొంది. శివానీ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలు పనికిరావని వైద్యులు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు సీఐ మహేశ్ గౌడ్ మీడియాకు తెలిపారు.
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..