ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కి సంబంధించి బ్లాక్ టిక్కెట్ల అక్రమ దందాపై పోలీసులు దాడులు చేశారు. ఎస్ఓటీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 15 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టిక్కెట్ల దందా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు(ఆదివారం, మార్చి 23) ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ టిక్కెట్ల దందా షురూ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించినట్లు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు తెలిపారు
Also Read
- pakala: భార్య, ఇద్దరు బిడ్డలను బావిలోకి తోసి హత్య పాకాలలో హృదయ విదారక ఘటన
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..