SGSTV NEWS
Spiritual

Gayatri Jayanti: గాయత్రీ జయంతి ఎప్పుడు? పూజ ప్రాముఖ్యత.. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అనేక ప్రయోజనాలు..



గాయత్రి జయంతి అనేది హిందూ మతంలో గాయత్రి దేవి జన్మదినోత్సవాన్ని జరుపుకునే ఒక పండుగ. ఇది వేద మాత గాయత్రికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజుని గాయత్రీ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున వేదమాత గాయత్రి అవతరించిందని చెబుతారు..


సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన పండుగ గాయత్రీ జయంతి. గాయత్రి దేవిని వేదాల దేవతగా భావిస్తారు. సకల శక్తులకు ఆధారం గాయత్రీ మాత. . నాలుగు వేదాల సారాంశమే గాయత్రీ మంత్రం. అందుకనే అన్ని మంత్రాలలోకెల్లా గాయత్రి మంత్రం అత్యంత పవిత్రమైన మంత్రం. గాయత్రీ దేవిని లక్ష్మీ, సరస్వతి, కాళికా దేవికి ప్రతీకగా భావిస్తారు. సకల వేదాలకు మూలం ఆ తల్లే. గాయత్రి దేవి జ్ఞానం,ఆధ్యాత్మిక వృద్ధికి చిహ్నం, కనుక గాయత్రి జయంతి రోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలోని చీకటి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు.

గాయత్రీ జయంతి తేదీ
వేద క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి అంటే నిర్జల ఏకాదశి రోజున గాయత్రీ జయంతి. ఈ ఏడాది ఈ తిధి జూన్ 6న తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు జూన్ 7న ఉదయం 4:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం గాయత్రీ జయంతి పండుగ జూన్ 6న జరుపుకుంటారు.

గాయత్రీ జయంతి పూజ విధి
గాయత్రీ జయంతి నాడు పూజ చేయడానికి ఉదయమే నిద్ర లేచి.. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తరువాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించండి. తరువాత దేవుళ్ళకు గంగా జలంతో అభిషేకం చేయండి. ఆ తర్వాత గాయత్రీ మంత్రాన్ని జపించండి. తరువాత గాయత్రీ దేవికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి.


గాయత్రి మంత్రం

ఓం భూర్భువః స్వాః తత్ సవితుర్వరేణ్యమ్ |

భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్||

గాయత్రీ జయంతి ప్రాముఖ్యత
గాయత్రీ మంత్రం హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి. గాయత్రీ జయంతి రోజున గాయత్రీ దేవిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున గాయత్రీ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది

Related posts

Share this