బద్రీనాథ్ ధామ్.. ఉత్తరాఖండ్లోని హిమాలయాల ఒడిలో ఉన్న ఒక పవిత్ర స్థలం. ఇక్కడి బద్రీనాథ్ ఆలయం హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటి. చార్ ధామ్, చోటా చార్ ధామ్ తీర్థయాత్రలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. అయితే, ఆధ్యాత్మికంగానే కాకుండా బద్రీనాథ్లో అనేక రహస్యాలు, వింత సంఘటనలు జరుగుతాయని మీకు తెలుసా..? ఇక్కడ అందరినీ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే అక్కడ కుక్కలు మొరగవట. వాతావరణం కూడా వింతగా మారుతూ ఉంటుందట. ఈ అద్భుతాలు ఆ పవిత్ర స్థలానికి దైవిక శాంతిని అందిస్తాయని పలువురు పండితులు, భక్తులు చెబుతుంటారు. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది. దీని వెనుక ఉన్న కథనాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
Badrinath Temple: బద్రీనాథ్ ధామ్..ఈ ఆలయం ధ్యాన దేవుడు విష్ణువు మూర్తికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం, విష్ణువు లోక సంక్షేమం కోసం తపస్సు చేయడానికి హిమాలయాలలోని ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వచ్చాడాని నమ్ముతారు.. ఆయన ఇక్కడ బద్రి (రాజు) చెట్టు కింద తీవ్రమైన తపస్సు చేశాడని, అందుకే దీనికి బద్రినాథ్ (బద్రి చెట్టు ప్రభువు) అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ గర్భగుడిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం మానవుడు చెక్కలేదు. కానీ, సహజంగానే పవిత్రమైన శాలిగ్రామ్ శిల నుండి ఏర్పడింది. విష్ణువు సాధారణంగా నిలబడి లేదా పడుకుని కనిపిస్తాడు. కానీ ఇక్కడ అతను పద్మాసనంలో లోతైన ధ్యానంలో కూర్చుని ఉంటాడు. ఇది చాలా అరుదైన దృశ్యం.
ప్రకృతి దైవిక నియమం బద్రీనాథ్ ధామ్లో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే రహస్యం అక్కడ ప్రకృతిలో కనిపించే మార్పులు. ప్రకృతి స్వయంగా దేవుడి కోసం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే యాత్రికులు, స్థానికులు తరతరాలుగా ఇక్కడ మూడు అద్భుతమైన విషయాలను గమనిస్తున్నారు. ఒకటి అక్కడ కుక్కలు మొరగడం లేదు. ఆ పట్టణంలో కుక్కలు ఉన్నప్పటికీ ఎవరూ అవి మొరగడం వినలేదు. ఏ పట్టణంలోనైనా కుక్కలు మొరగడం సర్వసాధారణం. కానీ ఇక్కడ ఇలా జరగడం వింతగా అనిపిస్తుంది.
ఇక రెండవ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నిశ్శబ్దమైన మెరుపులు. తుఫానుల సమయంలో ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. కానీ, వాటి తర్వాత భయంకరమైన ఉరుము శబ్దం ఉండదు. మూడవది నిశ్శబ్ద వర్షం. భారీ వర్షం పడుతోంది. కానీ, ఉరుముల శబ్దం ఉండదు. ఈ అద్భుతాల వెనుక బలమైన దైవిక కారణం ఉందని భక్తులు నమ్ముతారు. విష్ణువు ఆలయంలో నిరంతరం లోతైన ధ్యానంలో ఉంటాడని, అతని తపస్సుకు భంగం కలగకుండా ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా, గౌరవంగా ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ కుక్కలు మొరగవు, ఆకాశం ఉరుముకోదు, కాబట్టి భగవంతుని ఏకాగ్రత కొంచెం కూడా చెదిరిపోకుండా ఉంటుందని అంటారు. అందుకే భక్తులు తమ సమయాన్ని అక్కడ శాంతి, భక్తితో గడపాలని భావిస్తారు.
ప్రకృతి, జంతువులు, ప్రజలు భగవంతుని కోసం ఈ విధంగా మౌనంగా ఉంటారు. ఇది బద్రీనాథ్ను నిజంగా అద్భుతమైన ప్రదేశంగా చేస్తుంది. చుట్టూ ప్రకృతి సౌందర్యం ఉన్న ఈ ఆలయం పురాతన హిమాలయ ఇంజనీరింగ్కు చక్కటి ఉదాహరణ. సాంప్రదాయ గర్హ్వాలి శైలిలో రంగురంగుల ముఖభాగంతో నిర్మించబడిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 10,200 అడుగుల ఎత్తులో ఉంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రవహించే అలకనంద నది, నేపథ్యంలో నీలకంఠ శిఖరం చుట్టూ ఈ దృశ్యం చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. శతాబ్దాలుగా అనేక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలిచిన ఈ ఆలయం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, నిర్మాణ అద్భుతం కూడా
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు