హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం ఈ పర్వదినం ఏప్రిల్ 30వ తేదేన వచ్చింది. చాలా సంవత్సరాలుగా ప్రజలు ఈ రోజున ఏదో ఒకటి కొనే సంప్రదాయం ఉంది. కొందరు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొంటె.. మరికొందరు వాహనాలు, ఇళ్ళు లేదా దుకాణాలు కొంటారు. అయితే అందరూ భారీ మొత్తంలో డబ్బులను వెచ్చించలేరు.. వీటిలో మీరు కనుక కొనలేకపోతే నిరుత్సాహపడకండి.. అక్షయ తృతియ రోజున ఈ 5 వస్తువులను కొని ఇంటికి తీసుకురండి.
వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు. ఈ రోజున చేసే ఏ శుభ కార్యమైనా శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. పన్నెండు నెలల్లో ప్రతి శుక్ల పక్ష తృతీయ శుభప్రదమైనదని కూడా నమ్ముతారు. అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు.
అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైన సమయం. ఈ రోజున ఏ పంచాంగం చూడకుండానే ఏ పని అయినా చేయవచ్చు. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణ వేడుక, భూమి పూజ వంటి ఏదైనా శుభ కార్యం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ఈ రోజున బట్టలు, నగలు, ఇల్లు, ప్లాట్లు, వాహనం మొదలైనవి కొనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇటువంటి పెద్ద వస్తువులను కొనలేని వారు నిరాశ చెందవద్దు.. ఇంట్లోకి ఈ 5 వస్తువులను కొని ఇంటికి తీసుకు తెచ్చుకోండి.
పత్తి దూది మీరు ఇంటికి తీసుకురావాల్సిన మొదటి వస్తువు పత్తి. కనుక ముందుగా పత్తిని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి. ఈ రోజున పత్తి కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీ వ్యాపారాన్ని చాలా పెంచుతుంది.
రాతి ఉప్పు మీరు ఇంటికి తీసుకురావాల్సిన రెండవ వస్తువు రాతి ఉప్పు. ఈ రోజున రాతి ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు. అయితే ఈ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదని గుర్తుంచుకోండి.
మట్టి కుండలు మూడవది మట్టి పాత్రలు. అంటే మట్టి కుండలు. ఈ రోజున మీరు కుండ, గిన్నె, ప్రమిద ఇలా ఎటువంటి మట్టితో చేసిన మట్టి పాత్రలను కొనుగోలు చేయవచ్చు. బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొనడం కూడా బంగారం కొన్నట్లే పరిగణించబడుతుంది.
బార్లీ లేదా పసుపు ఆవాలు అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకురండి. బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం బంగారం, వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు.
గవ్వలు అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీ దేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలను అంటే చాలా ఇష్టం. ఈ రోజున, 11 గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీ దేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం