చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ గొల్లవానికుంటలో నివాసం ఉండే శారధ (37) అనే మహిళను ఆమె కొడుకు హత్య చేశాడు. తల్లి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని పిడిగుద్దులతో దాడి చేసి , గొంతు నులిమి హత్య చేశాడు.
AP Crime: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ గొల్లవానికుంటలో నివాసం ఉండే శారధ (37) అనే మహిళను ఆమె కొడుకు హత్య చేశాడు. చిత్తూరు జిల్లా, రొంపిచర్ల మండలం, మోటమల్లెల పంచాయతీ,నగరి గ్రామానికి చెందిన శారదకు తిరుపతి జిల్లా,చిన్నగొట్టిగల్లు మండలం, కోటబైలు పంచాయతీ,నల్లఓబులవారిపల్లి గ్రామానికి చెందిన సురేష్ తో వివాహమైంది. కాగా భర్త సురేష్ గత కొంతకాలంగా కువైట్లో పనిచేస్తున్నాడు.
శారధ తన ఇద్దరు కుమారులతో కలిసి గొల్లవానికుంటలో నివాసం ఉంటుంది. కాగా శారధ రేణిగుంట రోడ్డులోని మారుతీ షోరూమ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తోంది. రోజు విధులకు వెళ్లి వస్తోంది.ఈ క్రమంలోనే తల్లి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన కొడుకు శారధపై పిడిగుద్దులతో దాడి చేసి , గొంతు నులిమి హత్య చేశాడు. బంధువులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామనిఅలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..