• ముఠా అరెస్టు, పరారీలో యువతి
కృష్ణరాజపురం: సిలికాన్ సిటీ, కోలారులో శ్వేతా గౌడ అలియాస్ గులాబ్ జామూన్ అనే కిలాడీ హనీట్రాప్ దందా మరుగున పడక ముందే మరో వలపు వల వెలుగుచూసింది. 21 ఏళ్ల యువతితో కలిసి మోసగాళ్లు ఓ కాంట్రాక్టరు (55)ను హనీ ట్రాప్ చేశారు. బ్యాడరహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
ఫోన్ చేసి ఇంటికి పిలిపించి..
వివరాలు.. దోపిడీ గ్యాంగ్కు చెందిన సంతోష్, అజయ్, జయరాజ్ అనే ముగ్గురు ఓ సివిల్ కాంట్రాక్టర్ను లక్ష్యం చేసుకున్నారు. నయన అనే యువతిని అతనికి పరిచయం చేశారు. ఆమె నిత్యం ఫోన్లో చనువుగా మాట్లాడేది. తర్వాత ఒక రోజు టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది. దీంతో ఈ నెల 9వ తేదీన కాంట్రాక్టరు ఆమె ఇంటికి వెళ్లాడు. కొంతసేపటికే నిందితులు పోలీసుల దుస్తుల్లో వచ్చారు. ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. అతనిని కొట్టి ఫోటోలు తీసుకున్నారు.
మేడంతో సెటిల్మెంట్ చేసుకో అని బెదిరించారు. అతని జేబులో ఉన్న రూ.29 వేల నగదు, ఫోన్పే నుంచి మరో రూ.26 వేలు, ఒంటిపై ఉన్న సుమారు రూ.5 లక్షల విలువ చేసే బంగారాన్ని లాక్కుని వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయాక ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని బాధితుడు యువతికి సూచించగా, అలా చేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. చివరకు ఒక్కడే బ్యాడరహళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులైన సంతోష్, అజయ్, జయరాజ్లను పోలీసులు బంధించారు. పరారీలో ఉన్న యువతి నయన కోసం గాలిస్తున్నారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





