ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణoలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి దీప దూప నైవేద్యాలను సమర్పించారు.అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణాకరన్ గురుకుల్ వారిని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు,
ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ వి నాగేశ్వరరావు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.ఇ.ఓ ఏకాంబరం,టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- (no title)
- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అన్నీ పునరుద్ధరించాలి….. ఈమని గ్రీష్మ కుమార్, జిల్లా అధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం.
- ప్రేమ వివాహం చేసుకుందామని వచ్చి.. పెళ్లి దుస్తుల్లోనే యువకుడి ఆత్మహత్య
- చౌడేశ్వరిని అప్పగించింది పోలీసు అధికారే!
- ఆ పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయం.. చీకటిగా మారిన ఓ తల్లి జీవితం..!





