SGSTV NEWS online
CrimeTelangana

ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక దాడి

కొణిజర్ల: ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై డిగ్రీ విద్యార్థితోపాటు ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కాలనీలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13) తల్లిదండ్రులు పనిమీద హైదరాబాద్ వెళ్లారు. నాయనమ్మ, తాతయ్య స్థానికంగా ప్రార్ధన చేసేందుకు వెళ్లారు. బాలిక ఇంటి సమీపంలో ఇంటర్ చదువుతున్న బాలుడున్నాడు. ‘మీ తమ్ముడు కిందపడిపోయాడ’ని నమ్మబలికి ఆమెను నిందితుడైన మరో బాలుడి ఇంటికి తీసుకెళ్లాడు. తలుపులు వేసి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న అరవింద్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఇద్దరు బాలురు కూడా బాలికపై అఘాయిత్యం చేశారు. మైనర్లిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఎస్సై సూరజ్ నిందితులపై పోక్సో, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేశారు. అరవింద్ ని అదుపులోకి తీసుకోగా బాలురు పరారీలో ఉన్నారు.

Also read

Related posts