సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే పీఎస్ వద్ద ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. పీఎస్ వద్ద వాహనం దిగి లోపలకు వెళుతుండగా అకస్మాత్తుగా డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించాడు. దీంతో, వాహనం తగిలి పోసాని కిందకు పడపోబోయారు. అయితే పక్కనే ఉన్న పోలీసులు పట్టుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిపోయారు. పీఎస్ లో పోసాని విచారణ ఇంకా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారంటూ జనసేన నేత మణి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… పోసానిని అరెస్ట్ చేశారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!