బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. యూట్యూబర్ అన్వేష్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు. అన్వేష్ సోషల్ మీడియాలో లక్షల మంది ముందు తన తల్లిని దూషించాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మేరకు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు. అన్వేష్ సోషల్ మీడియాలో ఎన్నో లక్షల మంది ముందు తన తల్లిని దూషించాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తాను చేసే పనులు నచ్చకపోతే తనను ప్రశ్నించొచ్చు.. కానీ తన తల్లి ఏం చేసిందని అన్నాడు. అంతేకాకుండా తన తండ్రి బతికే ఉంటే.. చనిపోయాడని చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బెట్టింగ్ యాప్స్కు తాము వ్యతిరేకం కాదని.. పెద్ద వాళ్లు ప్రమోట్ చేశారనే తాము కూడా ప్రమోట్ చేశాం అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read
- Andhra: స్టూడెంట్ బ్యాగ్లో లిక్కర్ బాటిల్.. కట్ చేస్తే, ఎంత ఘోరం జరిగిందో తెలుసా..?
- రూ. 1500 లంచం కేసులో 13 ఏళ్ల విచారణ.. సంచలన తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు
- కన్న కొడుకుపై స్టేషన్ మెట్లెక్కిన వృద్ధ దంపతులు.. విషయం తెలిసి పోలీసులే షాక్!
- Crime: నాతో వచ్చినవారు.. నాతోనే పోతారు!
- Sowmya Shetty : రెండో భార్యగా ఉంటానంటూ కోట్లు దోచేసింది.. బాధితులు లబోదిబో