‘
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర
కాకినాడ గ్రామీణం (సర్పవరం జంక్షన్), న్యూస్టుడే: ‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. శనివారం సామాజిక మాధ్యమం వేదికగా వీడియో విడుదల చేసిన ఆమె జగన్, వైకాపా ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ‘నా కుమార్తెకు కాళ్లు మాత్రమే చచ్చుబడ్డాయి. ఏపీలో ప్రభుత్వ వ్యవస్థే చచ్చుబడింది. నాకు జరిగిన అన్యాయం సీఎం జగనన్నకు తెలిస్తే న్యాయం చేస్తారని అంటే ప్రాణాలకు తెగించి ఆయన వద్దకు వెళ్లా. ఫలితం లేదు. నా సొంతిల్లును అమ్మించి ప్రభుత్వం కొత్తది ఇచ్చినట్లు ప్రచారం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. నేను, నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబునాయుడు, మీడియానే కారణం. చంద్రబాబు, లోకేశ్, పవన్కల్యాణ్, భరత్ (విశాఖ)కు కృతజ్ఞతలు. గతంలో నా బిడ్డ వెన్నునొప్పితో ఇబ్బంది పడేది. పోలీసులు కొట్టిన దెబ్బలతో వెన్నుపూస స్పర్శ లేకుండా పోయింది. శరీరం చచ్చుబడింది. వెన్నుపూస ఆపరేషన్ జరిగిన బిడ్డను ఈడ్చుకెళతారా? ఒక దివ్యాంగురాలిపై ఏపీలో జరిగిన దాష్టీకమిది. నా బిడ్డకు న్యాయం చేయమన్నందుకు నాపై పిచ్చిదన్న ముద్ర వేశారు..’ అని ఆరుద్ర విలపించారు. తన కుమార్తెకు న్యూరాలజీ ఇబ్బందులుంటే మానసిక సమస్యగా ముద్రవేసి పిచ్చాసుపత్రిలో పడేశారని పేర్కొన్నారు. ‘ఒక ఉగ్రవాదిలా, నక్సలైట్లా సుమారు 300 మంది పోలీసులు నా బిడ్డను లాక్కెళ్లారు. మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణల వల్లే ఈ ఇబ్బందులు’ అని పేర్కొన్నారు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024