హైదరాబాద్, : మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.
Also read :దారుణం: గుక్కెడు నీళ్ల కోసం కూలీపై ప్రతాపం.. కొట్టి చంపిన ఆకతాయిలు
డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్ అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించారు. పక్కనే అనస్థీషియా మత్తు వాయిల్ పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిమ్స్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
Also read :Andhra Pardesh: మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రాచీ కర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. ప్రాచీ కర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు.
Also red :Kidney Cheating: కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..!
శోభనం కోసం ఏర్పాట్లు.. గదిలో అలా కనిపించిన వరుడు.. వధువు షాక్
ఆ విషయంలో పూజకు భర్తతో గొడవ.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి