ఏసీబీ అధికారులు మంటూ బురిడీ రూ. 2లక్షలు ఫోన్ పంపింన సబ్ రిజిస్టర్
పోలీసులకు పిర్యాదు చేసిన సబ్ రిజిస్టర్ శ్రీనివాస్
నరసాపురం, మొగల్తూరు(పశ్చిమగోదావరి జిల్లా): మొగల్తూరు సబ్ రిజిస్టర్ సబ్బిత శ్రీనివాసులు సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో బెదిరించి రెండు లక్షల కొట్టేశారు. మరో లక్ష రూపాయలు కోసం డిమాండ్ చేయటంతో అనుమానం వచ్చిన సబ్ రిజిస్టర్ మొగల్తూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బెదిరించింది సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారని నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ కు ఏసీబీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ‘నీ మీద అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, మేము రాకుండా ఉండాలంటే మూడు లక్షలు మా అకౌంట్లో వేయాలని’ కాల్ చేశారు. దీంతో శ్రీనివాస్ భయపడి ముందుగా రెండు లక్షలు ఫోన్ పే చేశాడు. అయినప్పటికీ కేటుగాళ్ళు విడిచి పెట్టలేదు. మిగిలిన లక్ష రూపాయలు అకౌంట్లో వెయ్యాలని పట్టుపట్టడంతో అనుమానం వచ్చిన సబ్ రిజిస్టర్ మొగల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం మొగల్తూరు ఎస్సై వై.నాగలక్ష్మి కేసు నమోదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ అకౌంట్, సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Also Read
- డ్యామిట్ సీన్ రివర్స్.. లవర్పై పెట్రోల్ పోసి నప్పంటించే ప్రయత్నం.. కట్చేస్తే..
- Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
- సాయంత్రం వేళ స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2026
- కరీంనగర్ లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి




