కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తోపాటు..ముగ్గురు జైలు వార్డర్లను సస్పెండ్ చేశారు.
Central Jail Kadapa : కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తోపాటు.. మరో ముగ్గురు జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
కడప జైల్లో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై నాలుగు రోజులపాటు కడప జైల్లో డిఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో విచారణలో భాగంగా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Also read
- Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
- సగం ధరకే బంగారం అంటూ ప్రచారం.. ఎగబడి పెట్టుబడి పెట్టిన ప్రజలు.. కట్చేస్తే..
- Telangana: వారాంతపు సంతలో నాన్నతో వెళ్లి పల్లీలు కొనుకున్న బాలుడు – రాత్రి తింటుండగా
- మరో దారుణం.. తండ్రితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసిన భార్యామణి!
- Gandikota Girl: తల్లే విలన్!.. గండికోట యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు!