వరంగల్ జిల్లా మనుగొండ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు మైనర్ను గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడుపు నొప్పిగా ఉందని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.
వరంగల్ జిల్లా గీసుకొండలో మైనర్పై అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు మైనర్పై దారుణానికి ఒడిగట్టాడు. మనుగొండ గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. వృద్ధుడు భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆ గ్రామంలో వృద్ధుడు ఇంటికి దగ్గర ఉంటున్న ఆ బాలికను లొంగదీసుకుని చాలాసార్లు అత్యాచారం చేశాడు.
పరీక్షలు నిర్వహించగా..
మైనర్ బాలికకు కడుపు నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఈ బండారం బయటపడింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆ బాలిక ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పలుమార్లు లొంగదీసుకుని తనపై అత్యాచారం చేశాడని బాలిక తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025