తన చావుకు సీఐ, ఎస్ఐ కారణం.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తి తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్( రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్ : తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తన దగ్గర అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి హసన్పర్తి పోలీసులను ఆశ్రయించాడు.
Suicide note
![](https://sgstvnews.in/wp-content/uploads/2024/05/20240501_2149187028445687368689628-649x1024.jpg)
![](https://sgstvnews.in/wp-content/uploads/2024/05/20240501_2149222205767041955388094-630x1024.jpg)
సీఐ తన సెల్ఫోన్, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. కాగా, తన భర్తను కాపాడి హసన్పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి బాధితుడి భార్య శ్యామల ఫిర్యాదు చేసింది. పోలీసుల దౌర్జన్యం వల్లే అవమాన భారం తట్టుకోలేక అదృశ్యమయ్యాడని పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ వ్యక్తి సూసైడ్ నోట్: తన భర్తను కాపాడాలంటూ భార్య ఆవేదన*
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..