July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

పోలీసులను చూసి పరుగులు.. భవనం పైనుంచి దూకి వ్యక్తి మృతి



పోలీసులను చూసి భయంతో పారిపోయే క్రమంలో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందాడు.లాలాగూడ: పోలీసులను చూసి భయంతో పారిపోయే క్రమంలో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్లోని లాలాపేట్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. భయాందోళనకు గురైన పేకాట రాయుళ్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో వినయ్ (35) అనే వ్యక్తి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Also read

Related posts

Share via