పెళ్లి చేసుకోడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్ఆర్ఎకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన అన్నాచెల్లెళ్లు చుక్కలు చూపించారు.
భోపాల్: పెళ్లి చేసుకోడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్ఆరొకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన అన్నాచెల్లెళ్లు చుక్కలు చూపించారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న యువకుడికి 2023లో మ్యాట్రిమోనీ ద్వారా ఇందౌర్ యువతి బర్ఖా జైస్వానీతో పరిచయమైంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మాయమాటలు చెప్పి ఈమె విడతలవారీగా యువకుడి నుంచి రూ.2.68 కోట్లు వివిధ ఖాతాల్లో బదిలీ చేయించుకుంది.
ఇటీవల ఉన్నట్టుండి వీడియో కాల్ చేసిన ఆ యువకుడికి మాట్లాడిన అమ్మాయి మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో ఉన్నట్టు లేకపోవడంతో అనుమానం వచ్చింది. డబ్బు గురించి అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో బాధితుడు అమెరికా నుంచి నేరుగా ఇందౌర్కు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. బర్ఖా అసలు పేరు సిమ్రన్ అని, వివాహిత అయిన ఆమె మ్యాట్రిమోనీ ప్రొఫైలులో ఓ మోడల్ ఫొటో పెట్టి తన సోదరుడు విశాల్తో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరినీ అరెస్టు చేశారు.
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!