జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాలో భూ వివాదం కారణంగా తల్లిదండ్రులపై కొడుకు నరేశ్ దాడి చేశాడు. దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG Crime: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులపై కొడుకు విచక్షణరహితంగా దాడి చేశాడు. అమ్మనాన్న అని కూడా కనీసం కనికరం లేకుండా కొడవలి, గడ్డపారతో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాం గ్రామంలో జరిగింది. ఈ దాడికి ప్రధాన కారణం భూ వివాదం అని తెలుస్తోంది. దీని కారణంగానే తల్లిదండ్రులపై కొడుకు నరేశ్ దాడి చేశాడు.
ఈ దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై వివరాలు అడగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also read
- Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్..
- వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల
- Banjara Hills: ఇంట్లోనే వ్యభిచారం.. అలేఖ్య అరెస్ట్
- మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు రోడ్డు ప్రమాదం.. పెద్ద కుమార్తె పరిస్థితి విషమం!
- Telangana: రాత్రంతా తల్లి మృతదేహంపై పడి గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించిన రెండున్నరేళ్ల చిన్నారి..!





