అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి ఏడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటుచేసుకుంది. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు.
అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి ఏడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటుచేసుకుంది. గజ్జెల్లి లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటోందని గమనించిన ఓ ఇద్దరు అమ్మాయిలు లక్ష్మి వద్దకు వచ్చి అనాథాశ్రమానికి చందా ఇవ్వాలని, వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చామంటూ ఆధార్ కార్డు చూపించాలని కోరారు.
ఈ క్రమంలో ఎవరూ లేని టైమ్ చూసి ఇంట్లోకి చొరబడి లక్ష్మి చేతులు, నోరు గట్టిగా పట్టుకొని ఆమె మెడలో ఉన్న ఏడు తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలి ఏడుపు విన్నచుట్టుపక్కల వాళ్లు గడియ తీసి విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నవీన్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





