July 1, 2024
SGSTV NEWS
CrimeNational

ఇలాంటి మహిళను సినిమాల్లో కూడా చూసుండరు.. భర్త ఎదుటే ప్రియుడితో కాపురం..


బంగారంలాంటి భర్త, ఓ పాప. కానీ పరాయి వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చాడు. అతడితో సాన్నిహిత్యం ఆమెకు స్వర్గాన్ని తలపించింది. అతడు కూడా భార్యను వదిలేసి.. ప్రియురాలితో జత కట్టాడు. ఇద్దరు

ఇద్దరు మేజర్లు.. కలిసి జీవించొచ్చు అని సుప్రీంకోర్టుతో సహా పలు న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పులు కొంత మందికి రెక్కలు ఇచ్చినట్లు అయ్యింది. ఇలాంటి తీర్పుల వల్ల కుటుంబ వ్యవస్థ నాశనమౌతుంది. ఇప్పుడు వివాహేతర సంబంధాలు విచ్చల విడిగా పెరిగిపోతున్నాయి. అప్పట్లో చాటు మాటుగా వ్యవహారం సాగిపోయేది కానీ నేడు భార్య కళ్లెదుటే మరో అమ్మాయితో రాసలీలలు సాగిస్తున్నాడు మగడు. ఇందులో మహిళలు ఏం తక్కువ తినలేదు. మొగుడ్ని కాదని, పరాయి పురుషుడితో వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. భర్తకు తెలిసినా కూడా.. మరింత రెచ్చిపోయి.. బహిర్గతంగానే ప్రియుడితో వేరో కాపురం పెట్టేందుకు కూడా సంకోచించడం లేదు. కాదంటే.. ఆగడాలకు అంతు ఉండటం లేదు. భర్త కన్నా ప్రియుడికే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు.


భర్తతో అన్యోన్యంగా జీవిస్తున్న మహిళ లైఫ్‌లోకి వచ్చాడు పరాయి పురుషుడు. దీంతో ఒక్కసారిగా జీవితం తల్లకిందులు అయిపోయింది. చివరకు అతడ్ని వదిలి ఉండలేక, కట్టుకున్న వాడితో కాపురం చేయలేక ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు కూడా ఆమెతో పాటే పయనం అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటుచేసుకుంది. లవర్ కోసం ముచ్చటైన 5 ఏళ్ల పాపను కాదని కానరాని లోకాలకు వెళ్లిపోయింది ఇల్లాలు. చెన్నై శివారులోని పెరుంబాక్కంలోని ఈఘిల్ నగర్ 5వ బ్లాక్‌కు చెందిన సెల్పియా మేరీక పెళ్లై.. ఓపాప ఉంది. ఆమెకు సెమ్మం చేరికి చెందిన విజయ్‌తో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. విజయ్ ఓ ప్రైవేట్ డ్రింకింగ్ వాటర్ ఫ్లాంట్‌లో పనిచేస్తున్నాడు. అతడికి కూడా పెళ్లైంది. మూడేళ్ల పాప ఉంది.

అయితే సెల్పియా, విజయ్ అక్రమ సంబంధాల గురించి తెలుసుకున్న ఇరువురు కుటుంబ సభ్యులు.. మందలించారు. అయితే అవన్నీ పట్టించుకోకుండా ఇద్దరు.. గత 6 నెలలుగా భర్త, భార్య, పిల్లలను ఒంటరిగా వదిలేసి అదే ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నారు.  ఈ క్రమంలో ఓ రోజు సెల్పియా తన స్నేహితురాలు సెల్‌ఫోన్‌లో మెసేజ్ పంపింది. అందులో ‘నన్ను, విజయ్‌ కలిసి జీవించడానికి నా కుటుంబం అనుమతించడం లేదు. ఇద్దరం ఆత్మహత్య చేసుకోబోతున్నాం’ అని పేర్కొంది. దీంతో షాక్‌కు గురైన రేఖ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీని ఆధారంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తర్వాత ఇద్దరూ తమ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. సెల్ఫియా, విజయ్ మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు

Also read

Related posts

Share via