ఏపీలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపైకి కారు ఎక్కించారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం స్మగ్లర్లు కారు వదిలి పారిపోయారు.పోలీసులు వీరికోసం గాలిస్తున్నారు
Kakinada: కాకినాడ జిల్లాలో కొత్త సంవత్సరం వేళ వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారు ఇద్దరు కానిస్టేబుళ్లపై నుంచి దూసుకెళ్లిన ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. వారిద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో ఉన్నారు. జగ్గంపేట పోలీసులు మంగళవారం రాత్రి కిర్లంపూడి మండలం కృష్ణవరం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై టోల్ప్లాజా దగ్గర వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు ఓ కారు వెళ్తుంది.
సాధారణ తనిఖీల్లో భాగంగా ఆ కారును కూడా కానిస్టేబుళ్లు ఆపారు. ఆ కారును రోడ్డు పక్కకు ఆపుతున్నట్లు డ్రైవర్ నటించాడు.. కానీ కారును ఆపకుండా వేగంగా దూసుకొచ్చాడు. ఆ వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే తోటి సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మరో కానిస్టేబుల్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారును రాజానగరం సమీపంలోని కెనాల్రోడ్డులో పోలీసులు గుర్తించారు . డ్రైవర్ కారును అక్కడ వదిలి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.. ఆ కారులో ఉన్న వారిని పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ కారులో గంజాయి
యూపీకి చెందిన ఆ కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ప్రకటించాల్సి ఉంది. అయితే కారు కానిస్టేబుల్స్పైకి దూసుకెళ్లిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!