జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా స్థాపించిన మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షించదగిన విషయమని, చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద గల స్వర్గీయ పింగళి వెంకయ్య కాంస్య విగ్రహానికి పలువురు నేతాజీ మిత్రమండలి సభ్యులు పూలమాలలు వేసి స్వర్గీయ పింగళి వెంకయ్యకు ఘనమైన నివాళులు అర్పించి, ఆ మహనీయుని సేవలను స్మరించుకుని,
కృష్ణాజిల్లా వాసుల చిరకాల వాంఛను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, పురందేశ్వరి,ఎంపీ వల్లభనేని బాలసౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాలోని ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు, నాయకులకు కృష్ణా జిల్లా ప్రజలందరి తరఫున నేతాజీ మిత్రమండలి సభ్యులు శుక్రవారం పత్రికాముఖంగా వారికి కృతజ్ఞతలు , ధన్యవాదాలు
తెలియజేసి హర్షం వ్యక్తం చేసినారు….
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతాజీ మిత్రమండలి సభ్యులు, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, పి. వి. ఫణి కుమార్, పంతం వెంకట గజేంద్ర రావు,
కూనప రెడ్డి బ్రహ్మయ్య , సూరిశెట్టి హరికృష్ణ, విన్నకోట సుబ్బారావు, వేమూరి రామకృష్ణారావు, పి ఎస్ ఎస్ ఆర్ శర్మ, మంచాల రాంబాబు కూనపురెడ్డి సుబ్బారావు, ఎం. సుబ్రమణ్యం, మాటూరి రామకృష్ణ, కే శ్రీనివాస్ లు మీడియాతో మాట్లాడుతూ…..
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి పేరు ప్రతిష్ట లు తెచ్చిపెట్టిన మహనీయుల సేవలను గుర్తించి భావితరాలకు ఆదర్శంగా ఉండేలా మచిలీపట్నంలో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షనీయం అన్నారు.
అలాగే మచిలీపట్నంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా గత వైసిపి పాలనలో నిర్లక్ష్యం చేయబడిన ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణాన్ని ఎంపీ వల్లభనేని బాలసౌరి, మంత్రి కొల్లు రవీంద్ర లు చొరవ తీసుకుని ప్రజలకు ఉపయోగపడేలా త్వరలోనే
పట్టాభి స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రజల తరఫున కోరుతున్నాము అన్నారు.
గత వైసిపి పాలకులు పూర్తిగా మహనీయులను విస్మరించారని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహనీయులను గుర్తించేలా వారి పేర్లు పెట్టి భావితరాలకు ఆదర్శంగా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలుస్తోంది అన్నారు.
ముఖ్యంగా మచిలీపట్నంలో నిర్మించిన మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలు గుర్తుండేలా వారి పేరును మెడికల్ కాలేజీకి పెట్టినందున రాష్ట్రప్రజల అందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ కు, ఎంపీ, వల్లభనేని బాల సౌరికి, మంత్రి కొల్లు రవీంద్ర కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లాలోని ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు పత్రికా ముఖంగా నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో తెలియజేశారు.
Also read
- Konaseema: కోనసీమ వాసుల కొంగు బంగారం.. కొబ్బరి కాయ కొడితే కోర్కెలు తీర్చే గణేశుడు..
- ఈ రోజు నుండి ఈ రాశుల దశ తిరుగుతోంది
- పాము కాటుకు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమమం..!
- మద్యం మత్తులో బరితెగించిన యువకులు.. చిన్నారిని చిదిమేసిన కారు..!
- ప్రేమ పేరుతో మోసానికి వంచనకు గురయ్యాను.. నాకు న్యాయం చేయండి… స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు