ఆడబిడ్డగా జన్మించడమే ఆ చిన్నారి చేసిన ‘పాప’మైంది. అనారోగ్యం పాలై.. చికిత్స అందక.. పుట్టిన రెండు నెలలకే ప్రాణాలు విడిచింది.
సింగరాయకొండ : ఆడబిడ్డగా జన్మించడమే ఆ చిన్నారి చేసిన ‘పాప’మైంది. అనారోగ్యం పాలై..చికిత్స అందక.. పుట్టిన రెండు నెలలకే ప్రాణాలు విడిచింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి, నాన్నమ్మ, తాతయ్య కర్కశంగా వ్యవహరించడంతో బందీగా మారి బలైపోయింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 15 రోజుల క్రితం ఈ దారుణ సంఘటన చోటుచేసుకోగా స్థానిక పోలీసుల నిర్లక్ష్యం.. నాయకుల ఒత్తిడి కారణంగా ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సీఐ హజరత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయకొండలోని డ్రైవరుపేటకు చెందిన షేక్ సందానీబాషాకు.. పాకలకు షేక్ రషీ దాతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ఏడాది తర్వాత వీరికి ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు రషీ దాను వేధించడం మొదలుపెట్టారు. ఈ ఏడాది జులై 31న ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో రషీదా మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వేధింపులు తారస్థాయికి చేరాయి.
ఈ క్రమంలో పుట్టినబిడ్డ రెండు నెలల కిందట అనారోగ్యం పాలైంది. స్థానిక వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లాలని సూచించారు. భర్త, అత్తమామలు ఆ పాపకు వైద్యం అందించకుండా ఇంటి వద్దనే ఓ గదిలో తల్లి కుమార్తెలను బంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సెప్టెంబరు 26న శిశువు చనిపోయింది. అక్టోబరు 3న బాధితురాలు పోలీస్టేషన్లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 5న భర్త సందానీబాషా, మామ మెహబూబ్ బాషా, అత్త సుల్తాన్బీలను అరెస్టు చేశారు.
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





