ఆడిపిల్లంటే అందరికీ అలుసే. కనడానికి అమ్మకు బరువు. పెంచడానికి నాన్నకు బెదురు. కొడుకుతో సమానంగా చూసేందుకు ఏ ఒక్కరికీ మనసేరాదు. ఆడశిశువును ఓ చీడ పరుగులా, కట్టుబానిసగా భారత సమాజం నేటికీ వివక్షకు గురిచేస్తూనే ఉంది. అందుకే అనాదిగా ఆడ పిల్లలను కడుపులోనే కాలరాస్తున్నారు. ఆలోచనలో మార్పురాకుంటే రేపటి అమ్మ కరువవుతుంది. కాలాలు మారుతున్నా.. సాంకేతిక అభివృద్ధి చెందుతున్నా..
Also read :రేయ్.. ఎవర్రా మీరంతా.. రాజధాని వాసులను షేక్ చేస్తున్న ఆ దొంగలు.. అసలేం జరిగిందంటే..
న్యూఢిల్లీ, జులై 28: ఆడిపిల్లంటే అందరికీ అలుసే. కనడానికి అమ్మకు బరువు. పెంచడానికి నాన్నకు బెదురు. కొడుకుతో సమానంగా చూసేందుకు ఏ ఒక్కరికీ మనసేరాదు. ఆడశిశువును ఓ చీడ పరుగులా, కట్టుబానిసగా భారత సమాజం నేటికీ వివక్షకు గురిచేస్తూనే ఉంది. అందుకే అనాదిగా ఆడ పిల్లలను కడుపులోనే కాలరాస్తున్నారు. ఆలోచనలో మార్పురాకుంటే రేపటి అమ్మ కరువవుతుంది. కాలాలు మారుతున్నా.. సాంకేతిక అభివృద్ధి చెందుతున్నా.. ఆడ బిడ్డల పట్ల ఈ వివక్ష రోజురోజుకూ జడలు విప్పుకుని వికృతరూపం దాల్చుతుందేతప్ప మార్పు కానరావడం లేదు. తాజాగా ఓ తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టింది ఆడపిల్లని తెలుసుకుని, తన చేతులతోనే దారుణానికి ఒడిగట్టింది. కళ్లు కూడా తెరవని 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి అమానుషంగా చంపింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని ముండ్కాలోని తిక్రీ సమీపంలోని బాబా హరిదాస్ కాలనీలో గురువారం (జులై 26)జరిగింది. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) (ఔటర్) జిమ్మీ చిరామ్ మాట్లాడుతూ..
ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు వాడిన కత్తిని ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా మహిన భర్త గోవింద్ బహదూర్గఢ్లోని షూ తయారీ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. హత్యకు గురైన శిశువు వారి రెండో సంతానం. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తు అధికారులు మహిళ గుర్తింపును వెల్లడించలేదు.