పవర్ఫుల్ NSG కమెండో.. చేస్తున్న జాబ్ కు రిజైన్ చేసి.. తప్పుడు దారి పట్టాడు.. ఆ తర్వాత.. గంజాయి స్మగ్లింగ్కు కింగ్పిన్గా మారి.. లక్షలు సంపాదించాడు.. ఈ క్రమంలోనే.. మాజీ ఎన్ఎస్జీ కమెండోపై పోలీసులకు అనుమానం కలిగింది.. దీంతో అతనిపై డేగ కన్ను పెట్టారు..
పవర్ఫుల్ NSG కమెండో.. చేస్తున్న జాబ్ కు రిజైన్ చేసి.. తప్పుడు దారి పట్టాడు.. ఆ తర్వాత.. గంజాయి స్మగ్లింగ్కు కింగ్పిన్గా మారి.. లక్షలు సంపాదించాడు.. ఈ క్రమంలోనే.. మాజీ ఎన్ఎస్జీ కమెండోపై పోలీసులకు అనుమానం కలిగింది.. దీంతో అతనిపై డేగ కన్ను పెట్టారు.. తప్పించుకుని తిరుగుతున్న బజరంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు ఏకంగా రెండు నెలలపాటు దృష్టిసారించారు. చివరకు గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా.. రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నారు. రాజస్థాన్లో గంజాయి స్మగ్లింగ్కు కింగ్పిన్గా ఉన్న బజరంగ్సింగ్ను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ NSG కమెండో అయిన బజరంగ్సింగ్ గంజాయి స్మగ్లింగ్కు పాల్పడడం తీవ్ర సంచలనం రేపింది. 200 కేజీల గంజాయితో చురులో పట్టుబడ్డాడు బజరంగ్సింగ్. ముంబై దాడుల సమయంలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో ఆయన చురుకైన పాత్ర పోషించాడు.
రెండు నెలల స్పెషల్ ఆపరేషన్ తరువాత బజరంగ్సింగ్ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బజరంగ్ తెలంగాణ , ఒడిశా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 2021లో ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన భార్యను బరి లోకి దింపాడు. ఒడిశాలో బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న సమయంలో మావోయిస్టుల ఏరివేత సందర్భంగా అతడు గంజాయి స్మగ్లర్లతో టచ్ లోకి వచ్చాడు.
రెండు నెలల వేట తర్వాత అరెస్టు
అయితే.. 25,000 రూపాయల రివార్డు ప్రకటించిన అనంతరం బజరంగ్ సింగ్ను గత బుధవారం చురులో అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ సందర్భంగా, అధికారులు దాదాపు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల పాటు జరిగిన “ఆపరేషన్ గంజనే” దర్యాప్తులో సాంకేతిక నిఘా, ఇన్ఫార్మర్లు, బహుళ రహస్య స్థావరాలలో నిరంతరాయంగా వెంబడించడం వంటి చర్యలతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లో ఉగ్రవాద-మాదకద్రవ్యాల సంబంధాన్ని తటస్థీకరించడంలో బజరంగ్ లాంటి కరుడుగట్టిన వారిని అరెస్టు చేయడం ఒక ముఖ్యమైన విజయం అని సీనియర్ పోలీసు అధికారి వికాస్ కుమార్ అన్నారు. బజరంగ్ చాలా జాగ్రత్తగా ఉంటూ.. అతను నిరంతరం స్థానాలను మార్చడంతోపాటు.. మొబైల్ ఫోన్లను మార్చేవాడని తెలిపారు.
కమాండో నుండి క్రిమినల్ వరకు
సికార్ జిల్లాలోని కరంగ గ్రామానికి చెందిన సింగ్.. రెజ్లింగ్ లో రాణించేవాడు.. ఆ తర్వాత సరిహద్దు భద్రతా దళంలో చేరి.. NSGలో పనిచేశాడు.. మొత్తం ఏడు సంవత్సరాల పాటు సేవలందించాడు.. ముఖ్యంగా 2008 ముంబై దాడులు.. అక్కడ అతను తాజ్ హోటల్ లోపల సాయుధ ఉగ్రవాదులతో పోరాడాడు.
2021లో పదవీ విరమణ చేసిన తర్వాత, సింగ్ స్థానిక రాజకీయాల్లో ఉనికి కోసం ప్రయత్నించాడు.. కానీ అతని ఆశయాలు పతనమయ్యాయి. రాజకీయాల్లో పట్టు సాధించడంలో వైఫల్యం.. అతన్ని చీకటి మార్గంలోకి నడిపించింది.. అక్కడ అతను మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులతో సంబంధాలను పెంచుకోవడం ప్రారంభించాడు. ఒడిశా – తెలంగాణలో తనకున్న మునుపటి పరిచయాలను ఉపయోగించుకున్నాడు. చిన్న లావాదేవీలుగా ప్రారంభమైన ఈ వ్యవహారం త్వరగా పూర్తి స్థాయి స్మగ్లింగ్గా మారిందని.. పోలీసులు తెలిపారు.
Also read
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
- చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..