July 8, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం

వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

వేంపల్లె, : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు బుధవారం కడపకు వెళ్లి అదే రోజు రాత్రి ట్రిపుల్ ఐటీకి తిరిగొచ్చారు. వారిని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దీనిపై వారు వర్సిటీ అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన ట్రిపుల్ఎటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, ఏవో రవికుమార్, ఇతర కోర్కమిటీ సభ్యులు విద్యార్థులను మందలించి, వారి తల్లిదండ్రులను క్యాంపస్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఆర్కేవ్యాలీ ఎస్సై తెలిపారు.

Also read :డ్వాక్రా మహిళల అండగా.. బలరాముడి ఉద్యమం

శ్రీగంధం దొంగిలించేందుకు వచ్చిన దుండగులు.. అటవీ అధికారులకు భలే దొరికిపోయారు..!

Related posts

Share via