బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోగి దిగిన పోలీసులు.. కుట్ర మొత్తాన్ని బయటపెట్టారు. విజయ్ కుమార్, మణికంఠ, చిట్టినేని అరుణ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మరో కుటుంబం కూడా ఇన్వాల్వ్ అయ్యినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లా చిన్న ఓగిరాల గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ముఠాగా ఏర్పడి ప్రజా ప్రతినిధులను భయబ్రాంతులకు గురి చేస్తున్న మాయాగాళ్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. క్షుద్రపూజలు చేసి చంపేస్తామని ప్రజలను మోసం చేసి భయపెట్టే గ్యాంగ్ను ఉయ్యూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు
చిన్న ఓగిరాల గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీకి చెందిన యెనిగండ్ల కుటుంబరావు, వైసీపీకి చెందిన పాలడుగు శివజ్యోతి రాజకీయ ప్రత్యర్థులు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుటుంబరావు భార్య సర్పంచ్గా గెలుపొందారు. ఈ క్రమంలో చేతబడి చేయించి ప్రత్యర్థిని చంపాలని శివజ్యోతి పన్నాగం పన్నారని ఆరోపించారు కుటుంబరావు కుటుంబసభ్యులు. ఇందుకోసం విజయకుమార్ అనే వ్యక్తిని ఆశ్రయించారు. దీంతో లంకె మణికంఠ స్వామితో క్షుద్రపూజలు చేయించాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. ఇందుకోసం విజయ్కుమార్కు 13 లక్షలు, మణికంఠస్వామికి శివజ్యోతి 2 లక్షల రూపాయలు ఇచ్చారని కుటుంబరావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబరావు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోగి దిగిన పోలీసులు.. కుట్ర మొత్తాన్ని బయటపెట్టారు. విజయ్ కుమార్, మణికంఠ, చిట్టినేని అరుణ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కుటుంబరావు ప్రత్యర్థులు చిట్టినేని అరుణ కుటుంబం కూడా ఇన్వాల్వ్ అయ్యినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలాంటి మూఢనమ్మకాలను మోసపోవద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తన్నారు.
Also read
- ఈ రాశుల వారికి జాక్పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు