టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. టీడీపీ పార్టీతో పాటు పదవులు కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని తెలిపారు.
టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. టీడీపీ పార్టీతో పాటు పదవులు కూడా వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవులకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు

నాపై ఉంచిన విశ్వాసానికి..
ఇన్ని రోజులు మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్ధతుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. తెలుగు దేశం పార్టీ ఇంకా ఎదగడంతో పాటు ప్రజా సేవలో కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు