గుంటూరు జిల్లా వెంగళరావునగర్లో బాలిక అపహరణం కలకలం రేపింది.
గుంటూరు: గుంటూరు జిల్లా వెంగళరావునగర్లో బాలిక అపహరణం కలకలం రేపింది. ఆమె తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి గుర్తు తెలియని దుండగులు బాలికను కారులో తీసుకెళ్లారు. విజయవాడ మీదుగా బాలికను తీసుకెళ్లేందుకు ముఠా ప్రణాళిక వేసింది. విజయవాడ బస్టాండ్ వద్ద కారు ఆపి.. ముఠా సభ్యులు భోజనానికి వెళ్లారు.
కారు డోరు లాక్ పడకపోవడంతో బాలిక తప్పించుకుంది. విజయవాడ బస్టాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి బాలిక విషయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ సిబ్బంది కిడ్పాపర్ల నుంచి బాలికను రక్షించారు. విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు కారును అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్లు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..





