గుంటూరు జిల్లా వెంగళరావునగర్లో బాలిక అపహరణం కలకలం రేపింది.
గుంటూరు: గుంటూరు జిల్లా వెంగళరావునగర్లో బాలిక అపహరణం కలకలం రేపింది. ఆమె తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి గుర్తు తెలియని దుండగులు బాలికను కారులో తీసుకెళ్లారు. విజయవాడ మీదుగా బాలికను తీసుకెళ్లేందుకు ముఠా ప్రణాళిక వేసింది. విజయవాడ బస్టాండ్ వద్ద కారు ఆపి.. ముఠా సభ్యులు భోజనానికి వెళ్లారు.
కారు డోరు లాక్ పడకపోవడంతో బాలిక తప్పించుకుంది. విజయవాడ బస్టాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి బాలిక విషయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ సిబ్బంది కిడ్పాపర్ల నుంచి బాలికను రక్షించారు. విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు కారును అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్లు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





