*కృష్ణా జిల్లా* :గన్నవరం/గుడివాడ
*ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా బుడమేరు కాలువ నీట ముంపునకు గురవ్వడం తెలిసిందే…** *ఈ తుప్ఫాను ప్రభావంతో నందివాడ మండలం చేదుర్తిపాడు గ్రామంలో సర్కార్ గట్టుకు గండి పడటంతో గ్రామం నీట మునిగి ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా గట్టుకు గండి పడటంతో బాపులపాడు మండలం వరకు ఉన్న పంట పొలాలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.* ..*ఈ విషయాన్ని గ్రామ పంచాయితీ సర్పంచ్ బొల్లం వేణుగోపాలరావు, గ్రామ పార్టీ నాయకులు తాతనబోయిన ఉమామహేశ్వరరావు, గ్రామస్తులు కలిసిగుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము,నాయకులు యార్లగడ్డ రవి దృష్టికి తీసుకెళ్లారు* .*దీంతో వారు స్పందించి సుమారు 100 మీటర్లు వరకు సర్కార్ గట్టుకు కాంట్రాక్టర్ గొట్టిపాటి శ్రీధర్ సమక్షంలో మర్రమతులు చేపట్టారు… ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడ్డామని,అడిగిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.*.
Also read.
- నిజ జీవితంలో ‘నాన్న పులి కథ’.. భర్త కళ్ల ముందే భార్య మృతి. సరిగా ఉరివేసుకో అనడంతో..
- తీవ్ర విషాదం.. భర్త మీద కోపంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన మహిళ..!
- బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!





