తమ బంధువుల అమ్మాయి ఫొటో నీ చరవాణిలో ఎందుకు ఉందని ప్రశ్నించడమే తప్పైంది.
ఆటోడ్రైవర్ పై గంజాయి ముఠా దాడి జిల్లా కేంద్రంలో ఆటవిక రాజ్యం
ఒంగోలు: తమ బంధువుల అమ్మాయి ఫొటో నీ చరవాణిలో ఎందుకు ఉందని ప్రశ్నించడమే తప్పైంది. గంజాయి ముఠా విరుచుకు పడింది. పైశాచికంగా దాడి చేసింది. కాళ్లతో తన్నారు.. కర్రలతో చావగొట్టారు. రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. కొట్టొద్దని ప్రాధేయ పడుతున్నా కనికరించలేదు.. దెబ్బలకు తాళలేక రోదిస్తున్నా వదల్లేదు.. ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కళాశాల సమీపంలో గత నెల 25న చోటుచేసుకున్న ఈ దుర్మార్గం ఆలస్యంగా వెలుగు చూసింది.
మాట్లాడదామని పిలిచి…: ఓ యువతి ఫొటో విషయమై ఒంగోలు దేవుడిచెరువు ప్రాంతంలో నివసించే రోహిత్, దేవాల మధ్య వివాదం తలెత్తింది. దేవా సమీప బంధువైన అమ్మాయి చిత్రాన్ని రోహిత్ తన మొబైల్లో పెట్టుకున్నాడు. తన స్నేహితులకు తరచూ చూపుతున్నాడు. ఈ విషయం ఆటోడ్రైవర్ అయిన దేవా దృష్టికి వెళ్లింది. దీంతో అతను తమ బంధువుల అమ్మాయి ఫొటో నీ దగ్గర ఎందుకుంది.. అందరికీ ఎందుకు చూపుతున్నావని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న నిందితుడు అతనిపై కక్ష పెంచుకున్నాడు. మాట్లాడే నెపంతో మే 24వ తేదీ రాత్రి తమ నివాసాలకు సమీపంలోని సీతారామపురానికి దేవాను పిలిపించాడు. అనంతరం అక్కడ తన స్నేహితులతో కలిసి దుర్భాషలాడాడు. తిరిగి 25వ తేదీ మధ్యాహ్నం కూడా ఈ విషయంపై మాట్లాడదామని దేవాను మరోసారి శర్మ కళాశాల సమీపానికి రప్పించారు
వీడియోతో ఒక్కసారిగా కలకలం…: మాట్లాడమే అనుకుని వెళ్లిన దేవాపై రోహిత్ ఆధ్వర్యంలోని గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. కర్రలతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడికి దిగింది. బూతులు తిడుతూ, కేకలు వేస్తూ కర్రలు, రాడ్లతో అతని పై పైశాచికంగా దాడి చేసి కొట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు విలవిల్లాడుతున్నా కరుణించలేదు. కొందరు నివారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గంజాయి మత్తులో ఊగిపోతూ సదరు యువకులు అతనిపై విరుచుకుపడ్డారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతంలోని వాసులను భయాందోళనలకు గురిచేశారు. ఈ ఘటనపై గత నెల 26న ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు సాధారణ దాడిగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. తాజాగా పాశవిక దాడికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై పోలీసులు మరింత దృష్టి సారించారు.
Also read
- కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
- AP Crime: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు
- AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు
- Adilabad : ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే