తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఆర్ధిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ(ఆర్థిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు.సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ కె. ప్రసాద్, ఏసీపీ
సోమనారాయణ సింగ్ శనివారం ఓ ప్రకటనలో
వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని తిరుపతికి
చెందిన గంటా శ్రీధర్ (40) మాదాపూర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ.. కొండాపూర్ మసీదు బండలోకుటుంబంతో నివాసం ఉండేవాడు. సహోద్యోగులు, వారి కుటుంబికులతో పాటు.. కొంపల్లిలో ఓ వ్యాపారితోనూ పరిచయం పెంచుకున్నాడు. తనకు తెలిసిన వ్యక్తులు మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారం కొనుగోలుచేస్తారని.. అందరూ పెట్టుబడులకు ముందుకు రావాలని చెప్పేవాడు. డబ్బు చెల్లించిన కొద్ది రోజుల తర్వాత
బంగారం డెలివరీ అవుతుందని చెప్పాడు. అతని
మాటలు నమ్మిన కొంపల్లి వ్యాపారి రూ.1.48 కోట్లు
బదిలీ చేశారు. మరో 12 మంది నుంచి కలిపి నిందితుడు మొత్తం రూ.6.12 కోట్లు వసూలు చేశాడు. వీరందరికీకొన్ని ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులు ఇచ్చాడు.సికింద్రాబాద్ లోని 2 బంగారం దుకాణాల పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. అందరికీ మార్చి 22న బంగారం డెలివరీ చేస్తానని చెప్పాడు. అయితే మార్చి 5న అందరికీ ఫోన్ చేసి తిరుపతిలో తనకు సంబంధించిన భూ సమస్య ఉండటంతో వెళ్తున్నానని చెప్పి.. భార్యాపిల్లలతో సహా ఉడాయించాడు. అప్పటి నుంచి ఫోన్ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా కొండాపూర్లోని అతను ఫ్లాటు ఖాళీ చేశాడని, మోసపోయామని తెలుసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు. చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని తిరుపతిలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చి.. శనివారం రిమాండుకు తరలించారు.
Also read
- ఫేక్ డిగ్రీతో అమెరికాకు.. కట్ చేస్తే, రెండేళ్ల తర్వాత హైదరాబాద్లో అసలు మ్యాటర్ తేలింది..
- టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పెళ్లి బృందంపై కర్రలు, ఇటుకలతో దాడి..
- నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అయిదుగురు అరెస్టు*
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..