July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

TDP: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్

విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా నేతలు మంగళవారం తెదేపాలో చేరారు.

మంగళగిరి: విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన
పలువురు వైకాపా నేతలు తెదేపాలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్తోపాటు విల్లూరి భాస్కరరావు, ఉరుకూటి నారాయణరావు, దుర్గాలమ్మ దేవస్థానం ధర్మకర్త బత్తి మంగరాజు, గరుడ సత్రం ధర్మకర్త చరకం మణమ్మ, కంటిపిల్లి వరలక్ష్మి, గౌరీ శంకర్, వర్తక సంఘం జిల్లా సభ్యులు రామిరెడ్డి, నిమ్మ శ్రీనివాస్, ముక్కు శ్రీనివాస్, తదితరులు తెదేపాలో చేరారు. వీరికి చంద్రబాబు తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also read

Related posts

Share via