May 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

చెత్తకుప్ప దగ్గర ప్రభుత్వ శాఖల ఫైళ్లు..!
గుంటూరులో వెలుగు చూసిన ఘటన

అమరావతి : ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ రోడ్డుపక్కన చెత్తుకుప్ప దగ్గర ప్రత్యక్షం అయ్యాయి.. ఈ గుంటూరులో పశ్చిమ తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలోని చెత్తలో దుండ‌గులు ఫైళ్ల‌ను ప‌డేశారు. అయితే, అధికారులు వచ్చేసరికి చెత్తలోని దస్త్రాలు మాయం అయ్యాయి. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన త‌ర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తహశీల్దార్‌ ఫణీంద్ర తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఫైల్స్ దగ్ధం ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. ఈ ఘటనపై సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు..

Also read:

Related posts

Share via