తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు
Fake currency : తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా రూ.1,06,58,000/- (ఒక కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు) సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాలో కొంతమంది నకిలీ నోట్లు తయారు చేస్తున్నారనే సమాచారం అందింది. దీంతో పోలీసు బృందాలు నిఘా పెట్టి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ ముద్రించడానికి వాడిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్ రిపేరు చేయించుకున్న ఒక వ్యక్తి మెకానిక్ కు దొంగనోట్లు ఇచ్చాడు. అనుమానంతో ఆనోట్లను పోలీసులకు అందజేయగా ఆరా తీస్తే ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా నకిలీ నోట్లు ముద్రించి ఒక లక్ష అసలు నోట్లకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నట్లు గుర్తించారు. గుంటూరు బాలాజీనగర్ లోని స్లమ్ను డెన్గా ఏర్పాటు చేసి నకిలీ నోట్లను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. మధు అనే వ్యక్తి ఇంటర్నెట్లో చూసి దొంగ నోట్లు ఎలా చేయాలో ప్లాన్ చేశాడు. విజయవాడకు చెందిన మధుబాబు మరో వ్యక్తి మణికుమార్తో కలిసి నకిలీ నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు. కాగా అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు