తెలంగాణలో బెట్టింగ్ కేసుల దుమారం మారుమోగుతుంది. ఇప్పటికే రెండు పోలీస్ స్టేషన్లను పరిధిలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇతరుణంలో కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే హైకోర్టులను ఆశ్రయించి తమను అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ లు దాఖలు చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం యాంకర్ శ్యామల ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించింది. తన మీద నమోదైన రెండు కేసులలో పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే రూల్ ప్రకారం దర్యాప్తు అధికారులకు సహకరించాలని చెబుతూ శ్యామలాను పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఇక తాజాగా శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు శ్యామలాని పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ లని ఎవరు ప్రమోట్ చేయవద్దు అని శ్యామల మీడియా ముందు విజ్ఞప్తి చేసింది.
ఇక తాజాగా యాంకర్ శ్యామల బాటలోనే యాంకర్ విష్ణుప్రియ నడుస్తుంది. తనకు పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కలిగించాలని కోరుతూ విష్ణు ప్రియ హైకోర్టులో ముందస్తు మెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. మియాపూర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ను కొట్టివేయాలని కోరుతూ విష్ణు ప్రియ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. యాంకర్ శ్యామల కేసులో ఇచ్చిన ఉత్తర్వులనే విష్ణు ప్రియకు హైకోర్టు వచ్చింది. దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా విష్ణు ప్రియ ను ఆదేశించింది.
విచారణ సందర్భంగా మియాపూర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసులను ఒకే కేసుగా పరిగణించి దానిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సిట్ బృందానికి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాలు హైకోర్టు కు తెలిపాడు
Also read
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే
- నేటి జాతకములు..2 జూన్, 2025
- Bhadrachalam:భద్రాచలం రామాలయం లో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్
- Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..
- Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)