డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తిలో జరిగింది. ఓ మహిళకు డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విఫలం కావడంతో పసికందును రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు.
ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి ప్రాణాలను కాపాడేందుకు చివరకు పసికందు తల, మొండెంను వేరు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణీకి నెలలు నిండాయి
ప్రసవం చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి..
ఈ క్రమంలో ఆమెను అమరచింత ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్ నర్సు డెలివరీ చేయడానికి ప్రయత్నించగా విఫలమైంది. దీంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రసవం చేస్తుండగా.. పిండం వెనుక భాగం బయటకు వచ్చింది
దీంతో డాక్టర్లు చేతులు ఎత్తేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రైవేట్ వైద్యులు పసికందు తల మొండెం రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందును చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులు సరిగ్గా పనిచేస్తే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read
- Andhra: స్టూడెంట్ బ్యాగ్లో లిక్కర్ బాటిల్.. కట్ చేస్తే, ఎంత ఘోరం జరిగిందో తెలుసా..?
- రూ. 1500 లంచం కేసులో 13 ఏళ్ల విచారణ.. సంచలన తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు
- కన్న కొడుకుపై స్టేషన్ మెట్లెక్కిన వృద్ధ దంపతులు.. విషయం తెలిసి పోలీసులే షాక్!
- Crime: నాతో వచ్చినవారు.. నాతోనే పోతారు!
- Sowmya Shetty : రెండో భార్యగా ఉంటానంటూ కోట్లు దోచేసింది.. బాధితులు లబోదిబో