తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైపు గామన్ వంతెనపై ఆదివారం సాయంత్రం ప్రకంపనల్లో వ్యత్యాసం రావడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.
కొవ్వూరు పట్టణం, చాగల్లు, : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైపు గామన్ వంతెనపై ఆదివారం సాయంత్రం ప్రకంపనల్లో వ్యత్యాసం రావడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కొవ్వూరు- రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై ఉన్న ఈ వంతెన 52వ స్తంభం వద్ద యాక్షన్ జాయింట్ బేరింగ్లో సమస్య తలెత్తిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో టోల్ ప్లాజా మేనేజర్ రాజీవ్యాదవ్, సిబ్బంది ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఒకవైపు ట్రాఫిక్ నిలిపివేశారు. పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు మేనేజర్తో మాట్లాడి ఉన్నతాధికారులు, నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. ఈ విషయమై ఆర్అండ్ బీ ఆర్డీసీ డివిజన్ ఈఈ శ్రీకాంతన్ ‘మీడియా ‘ సంప్రదించగా వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. సోమవారం ప్రత్యేక నిపుణులు రానున్నారని, బేరింగ్లో సమస్య ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పారు.
Also read
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి
- విజయవాడ: సాధారణ వాహన తనిఖీలు.. బైక్స్పై అనుమానాస్పదంగా యువకులు.. చెక్ చేయగా
- AP News: ఆ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
- పర పురుషునితో పరారైన భార్యను..!
చామరాజనగర జిల్లాలో ఘోరం