July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

దళితుల ఆత్మీయసమ్మేళనం ఒక మోసం  జువ్వల రాంబాబు సూటి ప్రశ్న..

నిడదవోలు నియోజకవర్గం….ఈరోజు కానూరులో శ్రీనివాస నాయుడు గారు నిర్వహించే దళితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి. హాజరవుతున్న సోదరులకు కొన్ని ప్రశ్నలు… కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసినపుడు అంబేడ్కర్ సాక్షిగా మీరు ఏం స్పందించారో చెప్పగలరా? దళితుల మేనమామ జగన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఎప్పుడైనా ప్రశ్నించారా? రాజ్యాంగం ప్రసాదించిన. 28సంక్షేమ పథకాలు రద్దు చేస్తే మీ జగన్ మామను ఎందుకు రద్దు చేశారు అని ప్రశ్నించారా? నియోజక వర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కి ఒక్క రూపాయి అయినా కేటాయించారా? అని మీ ఆత్మీయ ఎమ్మెల్యేని ప్రశ్నించారా?మహనీయులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద వున్న విదేశీ విద్యా పథకం రద్దు చేసి జగన్ మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నప్పుడు. ఏంటి ఈ అన్యాయం అని ప్రశ్నించారా?SC ST సబ్ ప్లాన్ నిధులు ఈ 5సంవత్సరాల్లో ప్రభుత్వం 1లక్షా 16వేల 111కోట్లు దారి మళ్ళించి మా దళితుల నోట్లో మట్టి కొట్టాడు మన జగన్ మామా దీన్ని ప్రశ్నించారా? మన డబ్బులు అన్ని కులాల్లో లబ్దిదారులకు అందించారు మనల్ని వెనక్కి నెట్టారు. మీకు తెలుసా పసుపు.. కుంకుమ పథకానికి చంద్ర బాబు నాయుడు గారు సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు మన జగన్ మోహన్ రెడ్డి గారు ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు మరి ఇప్పుడు? ఈ ప్రభుత్వంలో SCST సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించడం ద్వారా దళిత గిరిజన కుటుంబాలు ఒక ఇన్నోవా కారు. ఒక భూమి ఒక ఇళ్ళు ఋణాలు కళ్యాణ మంటపాలు స్మశాన వాటికలు దళితులు కోల్పోయారు? అనే విషయాన్ని నిలదీయండి . అంబేడ్కర్ కోట్లాది మంది ప్రజల గుండెల్లో వున్నారు విగ్రహాల్లో కాదు ఓట్లు సీట్లు కోసం ఆయన్ని ఆకాశానికి ఎత్తేసి మనల్ని పాతాళానికి తొక్కేస్తున్నారు.గమనించండి. ప్రశ్నించండి. నియోజక వర్గంలో ఉన్న SC ప్రజా ప్రతినిధులను అడగండి మీ శాసన సభ్యులు వారితో ఎంత ఆత్మీయంగా వున్నారో అడగండి .. జువ్వల రాంబాబు..

Also read

Related posts

Share via