ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు శశి గార్డెన్లో నివాసముంటున్నాడు. అయితే.. తన ఇంటి పక్కన ఉండే అక్రమ్ అనే వ్యక్తి తనపై కార్పొరేషన్తో పాటు ఇతర విభాగాల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా.. బేకరీ కారణంగా తన ఇల్లు వేడి అవుతుందని.. బేకరీని మూసివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
బాధితుడు బుధవారం రాత్రి తన సోదరులతో కలిసి వీధిలో తిరుగుతుండగా.. కత్తులు, కత్తెరతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు. అక్రమ్, అతని ఇద్దరు సోదరులు దాడి చేసి.. ఘటన అనంతరం పరారైనట్లు చెప్పాడు. కాగా.. స్థానికులు గమనించి షాబాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శశి గార్డెన్ ప్రాంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు అక్రమ్, ఖాసీం, ఆజాద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
Also read
- Hyderabad: వనస్థలిపురంలో హైకోర్టు సీనియర్ లాయర్ కిడ్నాప్.. రూ. కోటి డిమండ్! ఆ తర్వాత..
- Bapatla: బావమరుదులతో మహిళ ఎఫైర్.. చూడండి చివరకు ఎంత పని అయిందో
- BIG BREAKING: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్
- ప్రభాకర్రావుకు కస్టమ్స్ అధికారి స్వాగతం, బౌన్సర్లు హంగామా, పోలీసులు సీరియస్
- Telangana: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్