సూర్యాపేటలో ప్రేమ సంబంధిత దాడుల పరంపరలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న యువతి దూరం పెడుతోందనే కోపంతో ఓ యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేటలోని స్నేహానగర్లో జరిగింది. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు యువతి కుటుంబం అంగీకరించకపోవడంతో పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది.
ఇద్దరూ దూరంగా ఉండాలని తీర్మానించారు. దీని తర్వాత స్పందన మహేష్ను దూరం పెడుతూ వచ్చింది. ఆగ్రహించిన మహేష్, స్పందన తన సోదరి ఇంట్లో ఉందని తెలుసుకొని, ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లి ఆమె తలపై సుత్తితో బలంగా దాడి చేశాడు.
Also read
- మద్యం తాగించి.. కత్తితో బెదిరించి
- మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి
- కాశీకి శివపార్వతులు..! అమలకి ఏకాదశి.. నూతన వధూవరులకు ఎందుకంత ప్రత్యేకమో తెలుసా..?
- నేటి జాతకములు..21 ఫిబ్రవరి, 2026
- చట్నీస్ రెస్టారెంట్లో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!





