SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: అరేయ్ పోతార్రా.. పైకేమో బ్రాండెడ్.. లోపలేమో వెరీ చీప్.. కొన్నారంటే ఇక అంతే..



పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా ఆగడం లేదు. నూనె, అల్లం వెల్లుల్లి పేస్టులే కాదు.. సబ్బులు, సర్ఫ్లు, గుడ్ నైట్‌లు, ఆల్ అవుట్లు ఇలా ప్రతి వస్తువును కల్తీ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. లేటెస్ట్‌గా బేగంబజారులో పలు గోడౌన్లు, షాపులపై దాడులు చేసిన సీసీఎస్ అధికారులు నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు.


పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా ఆగడం లేదు. నూనె, అల్లం వెల్లుల్లి పేస్టులే కాదు.. సబ్బులు, సర్ఫ్లు, గుడ్ నైట్‌లు, ఆల్ అవుట్లు ఇలా ప్రతి వస్తువును కల్తీ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. లేటెస్ట్‌గా బేగంబజారులో పలు గోడౌన్లు, షాపులపై దాడులు చేసిన సీసీఎస్ అధికారులు నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు. సీసీఎస్ స్పెషల్ టీం దాడుల్లో హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న నకిలీ టైడ్, ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్‌ ప్యాకెట్లతో పాటు.. జెమినీ, రెడ్‌లేబుల్, తాజ్‌మహల్‌ టీపొడి ప్యాకెట్లను గుర్తించారు. 1340 రెడ్ లేబుల్ నకిలీ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ నకిలీ ప్యాకెట్లు, 75 కిలోల లూజ్ టీ పౌడర్, 1900 సర్ఫ్ ప్యాకెట్లు, 3600 నకిలీ గుడ్ నైట్ లిక్విడ్ బాటిల్స్ సీజ్ చేశారు. 9500 నకిలీ లేబుల్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.


వీరంతా గుజరాత్ డీలర్ల నుంచి తక్కువ నాణ్యతగల మెటీరియల్ కొనుగోలు చేసి నకిలీ ప్యాకింగ్ కవర్లతో బ్రాండెడ్‌గా నమ్మించి గోషామహల్, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, ఇతర ప్రాంతాల్లోని వ్యాపారులకు విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. నకిలీ వస్తువుల తయారీ, విక్రయంపై వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సీసీఎస్ స్పెషల్ టీం బేగం బజారులోని పలు షాపులు, గోదాంలపై దాడులు చేసింది.



నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న రాజస్థాన్‌కు చెందిన జయ రామ్, కచ్చవా సురేందర్, హనుమాన్ రామ్‌ను అరెస్ట్ చేశారు. నిందితులను గోషామహల్, అఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు. కల్తీ దందా పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. సరుకులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని చెబుతున్నారు.

Also read

Related posts