తన చేతుల్లో పెరిగిన మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకొందన్న ఆవేదనతో ఓ మేనమామ విందుభోజనంలో విషం కలిపాడు.
కొల్హాపుర్ (మహారాష్ట్ర): తన చేతుల్లో పెరిగిన మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకొందన్న ఆవేదనతో ఓ మేనమామ విందుభోజనంలో విషం కలిపాడు. మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లా పన్హాలా పోలీస్ స్టేషను పరిధిలో జరిగిన వివాహ రిసెప్షనులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉట్రే గ్రామంలోని మేనమామ మహేశ్ పాటిల్ ఇంట్లో పెరిగిన ఆ యువతి తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకోవడం కుటుంబసభ్యులకు నచ్చలేదు. అయిష్టంగానే ఆ జంటను ఆశీర్వదించి రిసెప్షను ఏర్పాటు చేశారు. ఆందోళనతో రగిలిపోతున్న మేనమామ మహేశ్ అతిథుల కోసం సిద్ధం చేస్తున్న భోజనాల్లో విషం కలిపాడు. దూరం నుంచి దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు మహేశ్ను నిలదీయడంతో అతడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అతిథులు ఆ భోజనం ఆరగిస్తే పెద్ద అనర్థమే జరిగేది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆహార పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!