October 16, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

అందమైన భార్య అని సంతోష పడ్డాడు! కానీ.. ఆమె మాత్రం ప్రియుడితో!

ఓ వ్యక్తి అందమైన అమ్మాయి తన భార్యగా వచ్చిందని సంతోష పడ్డాడు. కానీ ఆమె టిల్లు సినిమాలో రాధిక ఇచ్చిన ట్విస్టు మించిన అదిరే ట్విస్టు ఇచ్చింది. ఆమె ప్రియుడితో కలిసి…

నేటికాలంలో చాలా మంది అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. అలానే తమకు నచ్చిన యువతిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తుంటారు. అలా అందమైన అమ్మాయి భార్యగా దక్కిన చాలా మంది సంతోషంగా సంసార జీవనం సాగిస్తున్నారు. అలానే ఓ వ్యక్తి కూడా అందానికి అసూయ కలిగే లాంటి యువతిని పెళ్లి చేసుకున్నాడు. అందమైన భార్య వచ్చిందని సంతోష పడ్డాడు. కానీ ఆమె తన పాలిట యమదూత అవుతుందని గ్రహించలేకపోయాడు. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అసలు స్టోరీ ఏంటా అనే కదా మీ సందేహం.. అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి…

Also read :దారుణం: ఆ పని చేయలేదని గర్భిణీ భార్యకు నిప్పంటించిన భర్త!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో కొత్వాలి ప్రాంతంలో మునేంద్ర ఉపాధ్యాయ, ప్రియాంక అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అతడు స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే సమయంలో మునేంద్ర వాకింగ్ చేస్తుండగా..గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపారు. అయితే అతడిని చంపడానికి గల కారణాలు ఏమిటనేది తొలుత ఎవరికి అర్థం కాలేదు. ఈ ఘటనపై మృతుడి సోదురడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఓ సంచలన విషయం తెలిసింది.

Also read :సోషల్ మీడియాలో పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమ-పెళ్లి.. అతని కోసం ఏం చేసిందో తెలిస్తే షాక్..!

మునేంద్ర ఉపాధ్యాయను చంపడంలో అతడి భార్యదే కీలక పాత్ర అని పోలీసుల విచారణలో తెలింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను చంపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు, అతడితో పాటు మరో ముగ్గురు కలిసి మునేంద్రను చంపేందుకు స్కెచ్ వేశారు. అనుకున్నట్లుగానే పథకం ప్రకారం..మునేంద్రను కాల్చి చంపారు. ఈ హత్యకు ప్రియాంకే డబ్బులు సమకూర్చడం కొస మెరుపు. భర్త వాకింగ్ కి వెళ్లిన విషయాన్ని ప్రియుడికి తెలియజేసింది. ఈ సమాచారంతో ప్రియురాలి భర్తను.. ఆ లవర్ దారుణంగా హత్యచేశాడు.
Also read :Andhra Pradesh: దారుణం.. డ్రైవర్‌ను బస్సుతో తొక్కించి, కిలో మీటర్ వరకు ఈడ్చుకెళ్లిన మరో బస్సు డ్రైవర్..!

ఈ కేసులో భోలా పచౌరి, రాజీవ్ గౌతమ్, రజత్ కుమార్, మృతుడి భార్య ప్రియాంకలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 పిస్టల్స్, 4 లైవ్, 1 ఖాళీ కాట్రిడ్జ్, సంఘటనకు ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రియాంకకు భానుతో ప్రేమ వ్యవహారం ఉందని, ఏడాదిన్నర క్రితం అతడితో కలిసి పారిపోయానని చెప్పిందని పోలీసులు విచారణలో తేలింది. తమకు మధ్య అడ్డుగా ఉన్న మునేంద్రను చంపేందుకు ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది. వారు అనుకున్న స్కెట్ ప్రకారం… మునేంద్రను చంపేశారు. ఇలా ప్రియుడి మోజులో పడి.. క్షణి సుఖం కోసం కొందరు మహిళు చక్కని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

Also read :Mahadev Mandir: ఈ ఆలయంలో డబ్బులు, కానుకలు నిషేధం.. శివయ్యకు జలం సమర్పిస్తే చాలు..

Related posts

Share via