గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది.

మేడ్చల్: ఆదివారం అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. అప్పటివరకు నాన్న.. నాన్న అంటూ ఇద్దరు కూతుళ్లు పిలుస్తుంటే ఆ తండ్రి మురిసిపోయాడు. వాళ్ల కబుర్లు వింటూ అలసట లేకుండా పనిచేయసాగాడు. కానీ ఆ మాటలే తండ్రి, కూతుళ్లకు చివరి మాటలు అయ్యాయి. ఆ క్షణాలే జీవితంలో ఆఖరి గడియలు అయ్యాయి. ముగ్గురూ ఒకేసారి ప్రాణాలు విడిచారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన వెలుగుచూసింది.
రైలు ఢీకొని రైల్వే లైన్మెన్, అతడి ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుడి పేరు చెందిన కృష్ణ. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందినవాడని తెలిసింది. ఇక పిల్లల పేర్లు వర్షిత, వరుణి. వీరిద్దరి రైల్వే ట్రాక్పై కూర్చోబెట్టి పనిచేస్తుండగా అదే ట్రాక్ మీదకు ట్రైన్ వచ్చింది. పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించి కృష్ణ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. కృష్ణ రైల్వే లైన్మెన్గా పని చేస్తున్నాడు.
వీడియో
Also read
- ఆయనొచ్చి మా మధ్య చిచ్చు పెట్టాడు.. నాకు నా భర్త కావాలి.. 10 నెలల బాబుతో నిరసన
- Andhra: ఏంటి ఫ్రెండ్ ఇలా చేశావ్.. కళ్ల ముందే స్నేహితుడి మరణంతో..
- ఎల్బీనగర్లో ఘోరం.. 11కేవీ విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు మృతి..
- Kedarnath Helicopter Crash: మరో ఘోర విషాదం.. కేదార్నాథ్లో కుప్పకూలిన హెలికాఫ్టర్! ఐదుగురు మృతి..
- ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు