కర్నూలు జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో 8వ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న దారుణంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాలుడిని కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించి రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరా గురుకులం కళాశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి తెగబడ్డారు. కొన్ని రోజులుగా ఈ తతంగం కొనసాగుతోంది. రోజుల తరబడి లైంగిక దాడి భరించలేక బాధిత విద్యార్థి కళాశాల యాజమాన్యంకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం (ఫిబ్రవరి 20) రాత్రి మరోమారు విద్యార్థిపై సీనియర్లు లైగింక దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆలూరు ఆసుపత్రికి తరలించి రహస్యంగా తరలించిన గురుకుల పాఠశాల సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- పసిపిల్లాడి ప్రాణంతో ఆసుపత్రి సిబ్బంది చెలగాటం.. వైద్యుల నిర్లక్ష్యానికి ఆర్నెళ్ల బాలుడు బలి..!
- మాట్లాడుకుందాం రా అన్న అని పిలిచింది.. ఒంటరిగా వెళ్లాక.. ఏం జరిగిందంటే..
- కళ్ల ముందే ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిన యువకుడు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో
- లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. రోడ్డున పడ్డ సెక్యూరిటీ గార్డ్ కుటుంబం..!
- నాగర్కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..నిర్వహకుల తీరుతో పసిప్రాణం బలి





